Jeevitha – Rajashekar : రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష !

-

టాలీవుడ్‌ సినీ నటుడు రాజశేఖర్ దంపతులకు ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా సినీ నటుడు జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష పడింది. ఏడాది జైలు శిక్ష తో విధించింది నాంపల్లి కోర్టు. అంతేకాదు.. ఈ దంపతులకు రూ.5 వేల జరిమానా విధించింది కోర్టు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు పై ఆరోపణ నేపథ్యంలో అల్లు అరవింద్‌ గతంలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అమ్ముకుంటున్నారని… అవకతకలకు పాల్పడుతున్నారని గతంలోనే… జీవిత, రాజశేఖర్ దంపతులు మీడియా ముందుకు పేర్కొన్నారు. దాతల నుంచి ఉచితంగా సేకరించి రక్తాన్ని అమ్ముకుంటున్నారని రాజశేఖర్ దంపతులు ఆరోపణలు చేశారు. అయితే.. వారి వ్యాఖ్యలపై అల్లు అరవింద్‌ గతంలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. తాజాగా అల్లు అరవింద్ వేసిన పరువు నష్టం దావపై తీర్పును వెలువరించింది కోర్టు. దీంతో జీవిత, రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష పడింది.

Read more RELATED
Recommended to you

Latest news