‘జవాన్‌’ ఓటీటీ రిలీజ్‌ కోసం అట్లీ సూపర్‌ ప్లాన్‌.. అదిరిందిగా..

-

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అట్లీ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ మాస్ ఎంటర్టైనర్ గురించి ఇప్పుడు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌పై ఈ చిత్ర దర్శకుడు అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ విన్న నెటిజన్లు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇంతకీ అట్లీ ఏం చెప్పాడంటే..?

‘‘సరైన నిడివి, ఎమోషన్స్‌తో ‘జవాన్‌’ థియేటర్‌ రిలీజ్‌ చేశాం. ఓటీటీ రిలీజ్‌కు వచ్చేసరికి ఇంకాస్త రిథమ్‌ యాడ్‌ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను దానిపైనే వర్క్‌ చేస్తున్నా. అందుకే హాలీడేకు కూడా వెళ్లలేదు. మిమ్మల్ని సర్‌ప్రైజ్‌ చేయాలనుకుంటున్నా’’ అని అట్లీ చెప్పారు.

మరోవైపు రానున్న నాలుగు నెలలు తన అబ్బాయితోనే టైమ్‌ స్పెండ్‌ చేయాలనుకుంటున్నానని అట్లీ చెప్పారు.  దాదాపు మూడున్నరేళ్ల నుంచి ‘జవాన్‌’ వర్క్‌లోనే ఉన్నానని.. ఈ సినిమా తర్వాత తనపై బాధ్యత మరింత పెరిగిందని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరేలా సినిమా చేయాలి కాబట్టి, కాస్త సమయం తీసుకుని తదుపరి ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేస్తానని అట్లీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news