సల్మాన్ కి ఆ విషయంలో ధైర్యం చెప్పిన కంగనా..!

-

గత కొన్ని రోజులుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై వస్తున్న బెదిరింపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . అంతే కాదు మొన్నటికి మొన్న ఆయనను చంపేస్తాము అంటూ దుండగులు డెడ్లైన్ కూడా విధించారు. ఇకపోతే తాజాగా ఆయనపై వస్తున్న బెదిరింపులపై కంగనా రనౌత్ స్పందించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. కంగనా మాట్లాడుతూ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదు కేంద్రం నుంచి భద్రత లభిస్తుంది అంటూ చెప్పడం ఇప్పుడు మరింత మందిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకపోతే ఎప్పుడు వివాదాస్పద కామెంట్లు చేస్తూ.. సల్మాన్ కు మద్దతుగా నిలవడం చూసి అందరూ షాక్ అవుతున్నారు.

తాజాగా ఏప్రిల్ 30న హరిద్వార్ కు వెళ్ళిన కంగనా.. గంగాహారతి చేశారు. త్వరలోనే కేదార్నాథ్ ధామ్ ను సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇటీవల ఒక కార్యక్రమంలో సల్మాన్.. ఎక్కడికి వెళ్ళినా తనకు పూర్తి భద్రత ఉందని తెలిపారు.. దుబాయ్ పూర్తిగా సురక్షితం.. కానీ భారతదేశంలోని ఒక చిన్న సమస్య ఉందంటూ వ్యాఖ్యానించారు.. ఈ క్రమంలోని నటి కంగనా సల్మాన్ కు కేంద్రం భద్రత కల్పించిందని ..దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని.. అందువల్ల భద్రత గురించి భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు.

అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోం మంత్రి అమిత్ షా నుంచి అతనికి రక్షణ లభిస్తోందని.. తనకు బెదిరింపులు వచ్చినప్పుడు తనకు కూడా సెక్యూరిటీ కల్పించారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అంటూ ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ముంబై పోలీసులు సల్మాన్ ఖాన్ కు వై క్యాటగిరి భద్రతను కల్పించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news