ప్రభాస్ పై కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

-

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం ఈమె చంద్రముఖి 2 మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2005లో విడుదలైన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ నిర్మించిన ఈ సినిమాలో లారెన్స్‌, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీ మీనన్‌, మహిమా నంబియార్ ప్రధాన పాత్రల్లో నటించారు. లారెన్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ప్రమోషన్లలో భాగంగా కంగనా రనౌత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ అంటే ఇష్టమని చెప్పింది. అంతేకాదు.. ఏక్ నిరంజన్ సినిమాలో కలిసి నటించినప్పుడు అప్పుడు చాలా యంగ్ ని.. ఆ సమయంలో ప్రభాస్ ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి ఫుడ్ పెట్టిన విధానం, తమను చూసుకున్న తీరు ఇష్టంగా గుర్తుంచుకున్నానని తెలిపింది. తామిద్దరం కలిసి పదేళ్లు అయిపోయిందని.. ఇప్పుడు మళ్లీ కలిస్తే రిఫ్రెషింగ్ గా ఉంటుందని చెప్పింది కంగనా. ఇక మూవీ షూటింగ్ లో ఒకరినొకరం టీజ్ చేసుకునే వాళ్లమని.. యాక్టర్ గా, పర్సన్ గా ఎదగడం చూస్తుంటే హ్యాపీగా ఉందన్న బ్యూటీ.. ఏక్ నిరంజన్ 2లో ఛాన్స్ వస్తే కచ్చితంగా ప్రభాస్ తో నటిస్తానని తెలిపింది కంగనా రనౌత్.

Read more RELATED
Recommended to you

Exit mobile version