ఎన్ ఐఏ ఆఫీస‌ర్‌గా కార్తికేయ‌.. అదిరిన ఫ‌స్ట్‌లుక్‌!

-

ఆర్ ఎక్స్ 100 ద్వారా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ‌. ఈయ‌న చేసిన సినిమాలు అన్నీ మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. కొన్ని ప్లాపులు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు కెరీర్‌లో ఏడో సినిమా చేస్తున్నాడు హీరో కార్తికేయ‌. ఆయ‌న రీసెంట్‌గా న‌టించిన చావుక‌బురు చ‌ల్ల‌గా ఎన్నో అంచ‌నాల న‌డుమ వ‌చ్చి ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

 

దీంతో ఇక‌పై చేసే సినిమాల్లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ఇందుకోసం శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యాన‌ర్ మీద వి.వి. వినాయక్ శిష్యుడు అయిన‌ శ్రీ సరిపల్లి డైరెక్ష‌న్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. అదే రాజావిక్ర‌మార్క‌. ఈ మూవీలో కార్తికేయ స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్నాడు. గ‌తంలో చేయ‌ని రోల్‌లో మెస్మ‌రైజ్ చేయ‌బోతున్నాడు.

ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ ను ఈ రోజు రిలీజ్ చేశారు. అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా ఈ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే ఇందులో కార్తికేయ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆఫీస‌ర్ గాచేస్తున్నాడు. ఇలాంటి పాత్ర చేయ‌డం కార్తికేయకు ఇదే మొద‌టిసారి. తాన్యా రవిచంద్రన్ ఇందులో తొలిసారి హీరోయిన్‌గా చేస్తోంది. మ‌రి కార్తికేయ ఆశలు ఈ మూవీతో నెర‌వేరుతాయా లేక ఇదివ‌ర‌కు ఉన్న సినిమాల లాగా నిరాశ ప‌రుస్తాయా అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news