నందమూరి తారకరత్న ఆఖరి క్షణాలు..వీడియో వైరల్

-

నందమూరి తారకరత్న మరణంతో టాలీవుడ్​లో విషాదం నెలకొంది. సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తారక్ మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తారకరత్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

అటు తారకరత్న మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో లోకేష్ పాదయాత్రలో ఆయన అస్వస్థతకు గురైన వీడియోను షేర్ చేస్తున్నారు. రద్దీలో తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆప్రమత్తమైన టిడిపి కార్యకర్తలు ఆయనను మోసుకుంటూ, జనాన్ని తోసుకుంటూ అంబులెన్స్ లో ఎక్కించారు. అక్కడి నుంచి కుప్పంకు తరలించారు. అక్కడ చికిత్స అనంతరం ఆరోగ్యం విషమించడంతో బెంగళూరుకు తీసుకెళ్లారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version