అన్నయ్య కోసం ఆరాటపడుతున్నా.. ఎమోషనల్ అవుతున్న ఎన్టీఆర్..!

-

ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినీ ప్రేక్షకులు కుటుంబ సభ్యుల మదిలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నందమూరి తారకరత్నను బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో పదిమంది ప్రత్యేక వైద్య బృంద పర్యవేక్షణలో ఉంచారు. ఈ క్రమంలోని ఆయనను చూడడానికి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా తరలివస్తున్నారు. అలా తారకరత్నను చూడడానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగళూరు చేరుకున్నారు. కళ్యాణ్ రామ్ తో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను తెలుసుకున్న అనంతరం ఎన్టీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “అన్నయ్య చికిత్సకు స్పందిస్తున్నారు.. ఆయనకు మెరుగైన వైద్యం అందుతోంది. ప్రస్తుతం పోరాడుతున్నారు .. క్రిటికల్ కండిషన్ నుంచి బయటపడ్డారని ఇప్పుడే చెప్పలేము.. ఒక కుటుంబ సభ్యుడిగా ఇక్కడికి వచ్చాను.. డాక్టర్లు కూడా సాయ శక్తుల ప్రయత్నిస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం ప్రార్ధనలు , అన్నయ్యకు అవసరం “అంటూ ఎన్టీఆర్ వెల్లడించారు.. మరొకవైపు కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..” మీ అందరి అభిమానంతో తప్పకుండా తమ్ముడు త్వరగా కోలుకొని మన ముందుకు రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను ” అని తెలిపారు.

ఇకపోతే క్లిష్ట పరిస్థితుల్లోనే మానవత్వం బయటకి వస్తుందనడంలో వీరే చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు. నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ ను పక్కకు పెట్టినప్పటికీ కూడా అందరూ బాగుండాలని ఎన్టీఆర్ కోరుకోవడం నిజంగా ఆయన గొప్ప మనసుకు నిదర్శనం అని చెప్పడంలో సందేహం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version