త‌మ వివాహ‌బంధంపై మ‌హేష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

-

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవ‌ల ది వోగ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూలో త‌మ వైవాహిక జీవితం గురించి వెల్ల‌డించారు. ‘‘నమ్రత, నేను పెళ్లి చేసుకొని 14 ఏళ్లు పూర్తి అయ్యింది. మేము ఒకరినొకరిని పూర్తిగా అర్థం చేసుకుంటాం. ఒకరిని ఒకరం గౌరవించాం. అదే మా సక్సెస్‌ఫుల్ మ్యారేజ్‌ సీక్రెట్’’ అంటూ మహేష్ చెప్పుకొచ్చారు.

అలాగే తన పిల్లలు కూడా తన జీవితాన్ని చాలా మార్చారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మ‌రోవైపు న‌మ్ర‌త మాట్లాడుతూ.. ఇతని లాంటి వ్యక్తిని చూడలేదు ఏదైనా క్రమబద్ధంగా జరగాలని అంటారు. మహేష్ కుటుంబాన్ని, సినిమాలను ఒకే మాదిరిగా చూస్తాడ‌ని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version