రూల్స్ మార్చేసిన మహేష్

-

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. మహేష్ 25వ సినిమాగా వస్తున్న ఈ మహర్షి మీద భారీ అంచనాలున్నాయి. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ 26వ సినిమా సుకుమార్ డైరక్షన్ లో వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారని తెలుస్తుంది. 1 నేనొక్కడినే తర్వాత సుకుమార్, మహేష్ కలిసి చేస్తున్న సినిమా ఈసారి హిట్ టార్గెట్ పెట్టుకున్నారు.

అంతేకాదు అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ తో కూడా మహేష్ సినిమా కమిట్ అయ్యాడని తెలుస్తుంది. ఇదిలాఉంటే మహేష్ తో కథా చర్చలు జరుపాలంటే రూల్స్ మార్చేశాడని తెలుస్తుంది. ముందు నమ్రత కథ వింటుందట అది నచ్చితే మహేష్ దగ్గరకు వెళ్తుందట. అంతేకాదు ఇదవరకు లైన్ చెప్పి ఓకే చేయించడం కాకుండా ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తేనే సినిమా కథ వినేందుకు సై అంటున్నాడట మహేష్.

ఇలా లైన్ విని ఓకే చేసిన బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు నిరాశ పరచడంతో ఈసారి ఫుల్ స్క్రిప్ట్ తో వస్తేనే కథ వింటాడని చెబుతున్నాడట మహేష్. యువ హీరోలు కూడా వరుస హిట్లు కొడుతుంటే మహేష్ భరత్ అనే నేను సూపర్ హిట్ కొట్టినా ఆ హిట్ మేనియా కొనసాగించేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి ఫుల్ స్క్రిప్ట్ తో కథలు వినైనా మహేష్ వరుస సక్సెస్ లు అందుకుంటాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version