కమిటీ కుర్రోళ్లు : నిహారికకు మహేశ్ బాబు కంగ్రాట్స్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త డైరెక్టర్లను, నటీనటులను ప్రోత్సహించడంలో ముందు ఉంటారు. ఏ సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమా రిలీజ్ అయినా దానిపై తాను స్పందిస్తారు. తాజాగా నిహారిక కొణిదెల నిర్మాణంలో దాదాపు 16 మంది నూతన నటీనటులతో నిర్మించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’ ను మహేశ్ బాబు ప్రశంసించారు. గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్నమైన తెరకెక్కిన ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటుండగా.. తాజాగా మహేశ్ బాబు కూడా ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. కమిటీ కుర్రోళ్ళు మూవీని యదువంశీ తెరకెక్కించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ మూవీ సినీప్రియుల ఆదరణను సొంతం చేసుకుంది.

‘‘కమిటీ కుర్రోళ్ళు’ గురించి చాలా మంచి విషయాలు వింటున్నాను. సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న నిహారికకు కంగ్రాట్స్‌. త్వరలోనే ఈ సినిమాను చూస్తాను’’ అని మహేశ్ బాబు చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ అయినా మంచి సినిమా వచ్చిందంటే చాలు దాన్ని ప్రశంసించడంలో.. కొత్త వారిని ప్రోత్సహించడంలో మహేశ్ బాబు ముందుంటారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version