ఓటీటీలోకి వాజ్‌పేయీ బయోపిక్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

-

భారత మాజీ ప్రధాని, దివంగత అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జీవితం ఆధారంగా ‘మై అటల్‌ హూ’ అనే సినిమా రూపొందింది. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి ఇందులో అటల్ బిహారీ వాజ్ పేయీ  పాత్ర పోషించారు. రవి జాదవ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తాజాగా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో మార్చి 14వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జీ5 కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

అజాత శత్రువులాంటి వ్యక్తి, రాజనీతిజ్ఞుడు అయిన అటల్ బిహారీ వాజ్‌పేయీ పాలనతో పాటు, రాజకీయ జీవితాన్ని మేళవించి ఈ సిని మా రూపొందించారు. ఆయన వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సవాళ్లు, కుటుంబం, స్నేహితులతో ఆయనకున్న బంధాన్ని కూడా తెరపై ఆవిష్కరించారు. కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణు పరీక్షలతో సహా చాలా అంశాలను ఇందులో ప్రస్తావించారు.

Read more RELATED
Recommended to you

Latest news