ప్రమాదంలో మంచు లక్ష్మి… ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లోనే ప్రయాణం !

-

manchu laxmi on air india: ప్రముఖ టాలీవుడ్ సినీ నటి మంచు లక్ష్మి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మంచు లక్ష్మి తాజాగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనపై స్పందిస్తూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను మంచు లక్ష్మి తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఆ వీడియోలో భాగంగా మాట్లాడుతూ ఒకేసారి విమాన ప్రమాద ఘటనలో వందల మంది ప్రాణాలను కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమని పేర్కొన్నారు.

manchu laxmi
manchu laxmi

మరణించిన వారికి తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. అయితే ప్రమాదం జరిగిన రోజే మంచు లక్ష్మి తాను ముంబై నుంచి లండన్ కు వెళ్లినట్టుగా పేర్కొన్నారు. అయితే తాను దేవుడి దయవల్ల జాగ్రత్తగా ల్యాండ్ అయ్యానని ఆ తర్వాత వెంటనే ఈ ఘటన గురించి తెలిసి షాక్ అయినట్లుగా మంచి లక్ష్మి వీడియో రూపంలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news