ఓటీటీలోకి ‘మంగళవారం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

-

ఆర్ఎక్స్ 100, ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ వంటి సినిమాలతో టాలీవుడ్లో సందడి చేసిన భామ పాయల్ రాజ్పుత్. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల మనసును దోచేసింది ఈ భామ. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తాయని అంతా భావించినా అలా జరగలేదు. కానీ తన వద్దకు వచ్చిన ఛాన్స్లను మాత్రం ఈ భామ వదులుకోవడం లేదు. అలా ఇటీవల ఈ బ్యూటీ నటించిన మిస్టరీ థ్రిల్లర్ మంగళవారం. విడుదలకు ముందు బాగా హైప్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఆ థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంది.

పాయల్‌ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే థియేటర్లలో మాత్రం ఈ చిత్రం మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ వేదికగా వినోదాన్ని అందించేందుకు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా ఈ నెల 26 నుంచి ‘మంగళవారం’ స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడలోనూ ఇది అందుబాటులో ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news