ఓటీటీలోకి పాయల్​ రాజ్​పుత్ మాయాపేటిక.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

-

ఆర్​ఎక్స్ 100, ఆర్​డీఎక్స్ లవ్, వెంకీమామ సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్​పుత్. ఈ బ్యూటీ ఆ తర్వాత అడపాదడపా సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక తాజాగా పాయల్ నటించిన సినిమా మాయాపేటిక. జూన్ 30వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. కానీ పాయల్ కోసం ఈ సినిమాకు వెళ్లారు చాలా మంది యువకులు.

ఇక థియేటర్​లలో మిస్ అయిన వాళ్లంతా మాయాపేటిక సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. దాదాపు రెండు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమా ఆహా వేదికగా ఈనెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓటీటీ సంస్థ ఆహా.. తన సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ని పంచుకుంది. మానవ జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌ ఇతివృత్తంగా సాగే కథతో రూపొందిన సినిమా ఇది. ఈ మూవీలో పాయల్‌ రాజ్‌పుత్‌ తో పాటు సిమ్రత్‌ కౌర్‌, సునీల్‌, శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. రమేశ్‌ రాపార్తి దర్శకుడు.

Read more RELATED
Recommended to you

Latest news