త్వరలో రూ.100 కోట్లతో సినిమా చేస్తున్నా – మోహన్ బాబు

-

త్వరలో రూ.100 కోట్లతో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు మంచు మోహన్ బాబు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు సినినటుడు మోహన్ బాబు. ఈ సందర్భంగా మంచు మోహన్‌ బాబు మాట్లాడుతూ… త్వరలో 100 కోట్ల రూపాయల వ్యయంతో సినిమా నిర్మిస్తూన్నా…వివరాలు మంచు విష్ణు వెల్లడిస్తాడని చెప్పారు.

రజనికాంత్ వ్యవహరం పై మాట్లాడాలి అంటే సాయంత్రం వరకు సమయం సరిపోదని ఎద్దేవా చేశారు మోహన్‌ బాబు. వివాదాల జోలికి ఇప్పుడు వెళ్ళదల్చుకోలేదని పేర్కొన్నారు. తిరుమలలో ఎన్నడు లేని విధంగా అద్బుతమైన పరిపాలన సాగుతుందన్నారు. ఇఓ దర్మారెడ్డి భక్తులుకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసారని కొనియాడారు. ఇలాగే తిరుమల అభివృద్ధి కొనసాగాలని కోరారు మోహన్‌ బాబు.

Read more RELATED
Recommended to you

Latest news