ఆర్పీ పట్నాయక్‌ మరో ప్రయోగం.. ఆడియో రూపంలో ‘భగవద్గీత’

-

ఇప్పటి వరకూ ‘భగవద్గీత’ అంటే తెలుగు వారికి ఘంటసాల గుర్తొచ్చేవారు. ఇప్పుడు గీతను నేటి యువత కోసం అందించడానికి సిద్ధమయ్యారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్‌. మ్యూజిక్ డైరెక్టర్ గా ఎన్నో అద్భుతమైన పాటలు అందించిన ఆర్పీ పట్నాయక్‌ మరో ప్రయోగంతో అందరి ముందుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ప్రకటన చేశారు.

నేటి యువతకు సరైన మార్గనిర్దేశం చేసే అత్యద్భుత తత్వజ్ఞానం, జీవనమార్గం చూపించే శాస్త్రం భగవద్గీతకు మించి ఇంకెక్కడా దొరకదని ఆర్పీ పట్నాయక్ అన్నారు. అందరికీ అర్థమయ్యేలా ఈ సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం (సంస్కృత శ్లోకాలు లేకుండా) నేటి యువత కోసం తాను రికార్డ్ చేశానని చెప్పారు. పూర్తి వివరాలతో త్వరలోనే వస్తానని ట్వీట్ చేశారు. మరి ఆర్పీ పట్నాయక్‌ తీసుకురాబోయే గీతాసారం ఆయనే స్వయంగా స్వరపరిచారా? లేక వేరెవరితోనైనా చెప్పించారా? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. సంగీత దర్శకుడిగానే కాకుండా గాయకుడు, నటుడు, దర్శకుడిగా ఆర్పీ పట్నాయక్‌ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.

Read more RELATED
Recommended to you

Latest news