ధనుష్-శేఖర్ కమ్ముల సినిమాలో నాగార్జున.. కింగ్ ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్

-

నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అక్కినేని ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్ లభించింది. ఇప్పటికే నాగ్.. నా సామిరంగ అనే కొత్త సినిమాను ప్రకటించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ విజయ్ బన్నీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్‌కు వీర లెవల్లో రెస్పాన్స్‌ వస్తోంది.

ఇక ఇప్పుడు నాగ్ మరో సినిమా అప్డేట్ వచ్చేసింది. తమిళ్ స్టార్ హీరో ధనుశ్.. శేఖర్ కమ్ముల కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో ఓ కీలక పాత్రలో నాగార్జున నటిస్తారనే కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయమూ తెలిసిందే. అయితే తాజాగా ఇదే విషయాన్ని చిత్రబృందం కన్ఫర్మ్ చేసింది.

ధనుశ్-శేఖర్ కమ్ముల సినిమాలో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో ధనుష్‌కు జోడీగా రష్మిక నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రేపో మాపో సెట్స్‌ మీదకు కూడా వెళ్లనుంది. సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version