కుప్పం ప్రజలకు నారా భువనేశ్వరి శుభవార్త…

-

కుప్పం ప్రజలకు నారా భువనేశ్వరి శుభవార్త చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటిస్తున్న నారా భువనేశ్వరి..అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పారు. ఎన్టీయార్ సంజీవిని ఉచిత వైద్యశాలను ప్రారంభించిన నారా భువనేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడారు.

ఎన్టీయార్ ట్రస్ట్ ప్రజలకు సేవలు అందించడం కోసం స్థాపించామని.. కుప్పం ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధ్యేశ్యంతో ఎన్టీయార్ సంజీవిని ఏర్పాటు చేశాని వెల్లడించారు. అదే విధంగా గిరిజన ప్రాంతాలలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వైద్యశాలల్లో ఏర్పాటు చేస్తామని.. మహిళలు అనుకుంటే ఎదైన చేయగలుగుతారని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. ఎన్టీయార్ స్మారక నాణ్యం విడుదల చేయడం ఆనందంగా ఉంది..ప్రభుత్వంతో మాకు ఎటువంటి కాంపిటీషన్ లేదని వెల్లడించారు. కుప్పంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవనాలు నిర్మిస్తామన్నారు నారా భువనేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version