బ‌ర్త్‌డేకు 25 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసింది!

-

దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి నయనతార. స్టార్ హీరోయిన్‌గా ఇప్ప‌టికీ అదే క్రేజ్‌ని మెయింటైన్ చేస్తున్న న‌య‌న‌తార త‌న క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే రాయ‌ల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఇటివ‌ల విహారం కోసం ప్రియుడు విఘ్నేష్ శివ‌న్‌తో క‌లిసి ప్ర‌త్యేక చార్టెడ్ ఫ్లైట్‌లో గోవా వెళ్లింది. మూడు రోజుల పాటు అక్క‌డే వుండి విఘ్నేష్‌తో క‌లిసి ఎంజాయ్ చేసింది.

ఇందు కోసం న‌య‌న అక్ష‌రాలా 25 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. కేవ‌లం మూడు రోజుల‌కే 25 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌డం ప్ర‌స్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది. త‌న‌కు కాబోయే భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ పుట్టిన రోజుని గ్రాండ్‌గా జ‌రుపుకోవ‌డానికి ప్ర‌త్యేకంగా గోవా వెళ్లిన న‌య‌న‌తార బ‌ర్త్‌డేకే 25 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలిసింది. గత‌ రెండేళ్లుగా చెట్ట‌ప‌ట్టాలేసుకు తిరుగుతున్న న‌య‌న్ – విఘ్నేష్ ల జంట త‌మ పుట్టిన రోజు వేడుక‌ల్ని ప్ర‌త్యేకంగా విదేశాల్లోనే జ‌రుపుకుంటున్నారు.

అయితే ఈ సారి కోవిడ్ కార‌ణంగా విఘ్నేష్ పుట్టిన రోజు వేడుక‌ల కోసం గోవాని ఎంచుకుంది న‌య‌న‌తార‌. త్వ‌ర‌లో పెళ్లికి సిద్ధ‌మ‌వుతున్న ఈ జంట క‌లిసి ఓ సినిమా కూడా చేయ‌బోతున్నారు. విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో న‌య‌న‌తార ఓ మ‌హిళా ప్ర‌ధాన చిత్రం చేయ‌బోతోంది. మ‌రో కీల‌క పాత్రతో స‌మంత న‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news