సరిలేరు’ ఈవెంట్ కి మెగాస్టార్ మాత్రమే కాదు…..మ్యాటర్ తెలిస్తే షాక్ అవడం ఖాయం…!!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు జనవరి 11న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలోని సాంగ్స్ ఇటీవల ప్రేక్షకుల ముందు వచ్చి మంచి స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే.

పలు కమర్షియల్ హంగులతో పాటు సోల్జర్స్ గొప్పతనాన్ని చాటిచెప్పే ఒక మంచి పాయింట్ తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా ని తెరకెక్కిస్తున్నట్లు టాక్. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈనెల 5వ తేదీన హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియంలో జరుగనున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్న ఈ ఈవెంట్ కోసం అప్పుడే భారీ స్థాయిలో ఏర్పాట్లు మొదలైనట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా విషయమై నేడు మరొక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, ఈ సినిమా కోసం ఒకటి కాకుండా రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తోందట సరిలేరు యూనిట్.

అందుతున్న సమాచారం ప్రకారం,ఈ రెండవ ఈవెంట్ జనవరి 9న జరుగనుందని, అలానే ఈ ప్రత్యేక ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక అతిథిగా విచ్చేయనున్నట్లు చెప్తున్నారు. ఇటీవల మహేష్, కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన ఎన్టీఆర్, మరొక్కసారి మహేష్ సినిమా ఈవెంట్ కి వస్తుండడం నిజంగా విశేషం అనే చెప్పాలి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై సరిలేరు టీమ్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే, మరొక్కసారి సూపర్ స్టార్ ని, యంగ్ టైగర్ ని ఒకే స్టేజ్ పై చూడవచ్చు…..!!

Read more RELATED
Recommended to you

Latest news