సైమా కోసం ఫ్యామిలీతో దుబాయ్​కు తారక్.. వీడియో వైరల్

-

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్​కి పయనమయ్యారు. ఈనెల 15, 16వ తేదీల్లో దుబాయ్​లో జరగనున్న సైమా వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’ (సైమా) వేడుక ఘనంగా జరగనుంది.

ఎన్టీఆర్‌తో పాటు హీరోలు యశ్, రిషబ్‌ శెట్టి, హీరోయిన్లు మృణాల్‌ ఠాకూర్‌, శ్రీలీల కూడా సైమా అవార్ట్స్‌ వేడుకలో పాల్గొననున్నారు. ఈ సంవత్సరం సైమా అవార్డుల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) ఏకంగా 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కించుకుంది. ‘సీతారామం’ చిత్రానికి 10 కేటగిరిల్లో .. ‘కాంతార’,‘కేజీయఫ్‌2’ సినిమాలకు 11 కేటగిరిల్లో నామినేషన్స్‌ దక్కాయి. తెలుగులో ఉత్తమ నటుడి కేటగిరిలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్, నిఖిల్‌, సిద్దూ జొన్నలగడ్డ, దుల్కర్‌ సల్మాన్‌, అడివి శేష్‌ పోటీపడుతున్నారు.

మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news