మరొక్కసారి మహేష్ తో జోడి కట్టనున్న శృతి హాసన్….??

-

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాల వరుస విజయాలతో మంచి జోష్ మీదున్నారు. ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ప్రక్కన హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి చాలా గ్యాప్ తరువాత సినిమాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు.

 

ఇక ఈ సినిమా తరువాత మహేష్ నటించబోయే తదుపరి 27వ సినిమా గురించి కొన్నాళ్లుగా టాలీవుడ్ వర్గాల్లో పలు చర్చలు జరుగుతున్నాయి. కాగా వాటన్నిటికీ తెరదించుతూ, ఇటీవల మహేష్ తో మహర్షి సినిమా తీసిన వంశీ పైడిపల్లి, మరొక్కసారి ఆయనతోనే తన తదుపరి సినిమా తీయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కథ పూర్తి కావచ్చిందని, ఆ సినిమా మరొక్కసారి దిల్ రాజు గారి బ్యానర్ లోనే రూపొందనుందని, అతి త్వరలోనే దానికి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని వంశీ అన్నారు.

ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ని ఎంపిక చేయాలని దర్శకుడు వంశీ, మరియు నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి గతంలో మహేష్ మరియు శృతి హాసన్ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది, అలానే వంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఎవడు సినిమా లో కూడా ఆమె హీరోయిన్ గా నటించారు. అయితే తాను ప్రస్తుతం మహేష్ కోసం రాస్తున్న కథకు శృతినే సరిగ్గా సరిపోతుందని భావించి ఆమెను సెలెక్ట్ చేసినట్లు టాక్. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడాల్సి ఉంది…..!!

Read more RELATED
Recommended to you

Latest news