నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల

-

డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమ‌వుతోంది. తాజాగా నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వచ్చేనెలలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

వచ్చే ఏడాది జనవరిలో 7,900 ఖాళీలతో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎప్పటి నుంచో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్తని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news