ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం..బాలయ్యతో పవన్ కళ్యాణ్ భేటీ !

-

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే.. మరో సంచలనం జరిగింది. నిన్న బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరిద్దరూ సినీ ప్రముఖులే కాకుండా, రాజకీయాల్లోనూ కీలక నేతలు కావడం తెలిసిందే.

అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్య, పవన్ నటిస్తున్న రెండు సినిమాల చిత్రీకరణ ఒకే సమయంలో జరుగుతుండటంతో వీరిద్దరి భేటీ జరిగింది. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి చిత్రంలో నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వీరసింహారెడ్డి సెట్స్ కు వెళ్లి బాలయ్యను కలిశారు. పవన్ కళ్యాణ్ చిత్ర బృందంతోను కలిసి వారితో కాసేపు ముచ్చటించారు. వీరసింహారెడ్డి చిత్ర బృందానికి పవన్ కళ్యాణ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version