SSMB28 : మహేష్ బాబుతో పూజా తో పాటు శ్రీ లీల రొమాన్స్..

-

అతడు, ఖలేజా చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడటమే ఆలస్యం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది.

వీరి కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా చిత్రం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. ఇందులోని ఓ నెగిటివ్ పాత్ర కోసం ఇటీవల ‘పొన్నియన్ సెల్వన్’ లో నటించి మెప్పించిన మలయాళ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మీని సంప్రదించారట.

అలాగే ఈ సినిమాలో శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు. అంటే మహేష్‌ సరసన శ్రీలీల, పూజా హెగ్డే నటిస్తున్నారన్న మాట. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర బృందం ప్రకటించింది. అలాగే, ఈ సినిమా షూటింగ్‌ ఈ నెల 18న ప్రారంభంకానుంది. అలాగే ఆగస్టులో సినిమా రిలీజ్‌ కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version