ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్.. రాముడు వచ్చేశాడు

-

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ఆది పురుష్. మైథాలజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి తానాజీ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారు. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడి పాత్రలో దేవ్ దత్త నగే నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని టి సిరీస్, రెట్రో ఫైల్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సాచెట్ – పరంపర ఆది పురుష్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ ఆది పురుష్ సినిమా జూన్ 16 న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా.. సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్, టీజర్ లు రిలీజ్ అయినప్పటి నుండి విపరీతమైన ట్రోల్స్ ని ఫేస్ చేస్తూ వచ్చింది. అయితే తాజాగా ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేసింది మూవీ యూనిట్.

ఈ ట్రైలర్ మొత్తం 3 నిమిషాల 20 సెకండ్లు ఉంది. సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం, అయోధ్య పరిచయం.. ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ముగించారు. ఈ ట్రైలర్ లోని విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి. టీజర్ చూసినప్పుడు ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ వచ్చిందో అది పూర్తిగా తొలగిపోయేలా బ్రహ్మాండంగా కట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news