గ్రామాన్ని దత్తత తీసుకుంటున్న ప్రభాస్.. ఎక్కడంటే !

-

ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ”గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాల్గొన్న సంగతి తెలిసిందే. పెదనాన్న కృష్ణంరాజు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి ఒక వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ ని దత్తత తీసుకుంటానని పేర్కొన్న సంగతి తెలిసిందే. అన్నట్టుగానే ఆయన ఈరోజు దత్తత తీసుకుంటున్నారు.

అయితే అది అడవి కాదు, హైదరాబాద్ ఓఆర్ఆర్ కి దగ్గరలో ఉన్న ఒక గ్రామం. ఖాజిపల్లె అనే ఈ గ్రామంలోని అర్బన్ బ్లాక్ ని ఈరోజు మరి కొద్దిసేపట్లో దత్తత తీసుకోనున్నారు. నిజానికి గ్రీన్ ఇండియా చాలెంజ్ సమయంలో ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడాలని నిర్ణయించుకున్నానని ప్రభాస్ వెల్లడించారు. అయితే ఈ గ్రామాన్ని ఆయన చూపించారా లేక సొంత నిర్ణయమా అనేది తెలియాల్సి ఉంది. ఈరోజు జరగనున్న కార్యక్రమానికి అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ లు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news