‘మా’ ఎన్నికలపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు.. జగన్‌, కేసీఆర్‌ లాగుతారా !

-

మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలపై నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌ లో ఎవరికి రాదని… మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రకాశ్‌ రాజ్‌. మా ఎన్నికల్లో జగన్‌, కేసీఆర్‌, బీజేపీని లాగుతారా అని నిలదీశారు ప్రకాశ్‌ రాజ్‌.
సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తానకు తెలుసునని హెచ్చరించారు ప్రకాశ్‌ రాజ్‌.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీ బంధువైతే… మా ఎన్నికలకు వస్తారా ? అని ప్రకాశ్‌ రాజ్‌ ప్రశ్నించారు. రెండు సార్లు హలో చెబితే… కేటీఆర్‌ ఫ్రెండ్‌ అయిపోతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నటుడు నరేష్‌ అహంకారి, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు. కొంచెం కోపం, బాధతో వేసే ఓటు సునామిలో మంచు విష్ణు కొట్టుకుపోవాలన్నారు ప్రకాశ్‌ రాజ్‌. కాగా.. మా అసోషియేషన్‌ అధ్యక్ష ఎన్నికలు ఈ నెల 10 వ తేదీన జరుగనున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news