ర‌జ‌నీ క్వారెంటైన్ కి వెళ్లాల్సిందేనా?

-

లాక్‌డౌన్ అన్‌లాక్ 5లో భాగంగా అన్ని రంగాలు రీ ఓపెన్ అవుతుండ‌టంతో బిగ్ స్టార్స్ కూడా షూటింగ్‌లు మొద‌లుపెడుతున్నారు. ఇటీవ‌ల తెలుగులో ప‌దుల సంఖ్య‌లో సినిమాల షూటింగ్‌లు రీ స్టార్ట్ అయ్యాయి. త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కూడా త‌న కొత్త చిత్రాన్ని తిరిగి మొద‌లుపెట్ట‌బోతున్నారు. ర‌జ‌నీ న‌టిస్తున్న తాజా చిత్రం `అన్నాతే`. `సిరుతై` శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై క‌ళానిధి మార‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మీనా, ఖుష్బూ, న‌య‌న‌తార కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 2019 డిసెంబ‌ర్‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. మ‌ధ్య‌లో క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. ఈ నెల 15 నుంచి హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మూవీ షూటింగ్‌ని పునః ప్రారంభించ‌బోతున్నారు. అయితే ఇందు కోసం ఈ నెల 8న ర‌జ‌నీ హైద‌రాబాద్ రాబోతున్నారు. వారం పాటు క్వారెంటైన్‌లో వున్న త‌రువాతే ర‌జ‌నీ `అన్నాతే` సెట్‌లో అడుగుపెడ‌తార‌ట‌. షూటింగ్ శ‌ర‌వేగంగా పూర్తి చేసి చిత్రాన్ని వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news