రాఖేష్ మాస్టర్ మూడవ భార్యను దారుణంగా కొట్టిన మహిళలు..

-

ఇటీవల ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈయన చనిపోవడంతో అభిమానులు, కుటుంబ సభ్యులు, తనకు అండగా ఉన్న వారు అంతా కూడా చాలా బాధపడ్డారు. కాగా రాకేష్ మాస్టర్ బ్రతికి ఉన్న రోజుల్లో అతనితో పాటు వీడియోలు చేస్తూ తన మూడవ భార్యగా చెప్పుకుని తిరుగుతున్న లక్ష్మి గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. తాజాగా హైద్రాబాద్ లోని పంజాగుట్ట లో స్కూటీపై వెళ్తున్న ఈమెను ఆపిన మరో ఐదుగురు మహిళలు రౌండ్ అప్ చేసి చితక్కొట్టారు. కారణం ఇది చెప్పకుండా ఆమెను ఒక్కదాన్నే చేసి కొట్టడంతో అక్కడ చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఎవరూ అడ్డు చెప్పకుండా చూస్తూ ఉండిపోయారని తెలుస్తోంది. ఇంతలో ఎవరో.. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి అందరినీ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేస్తున్నారు.

కాగా లక్ష్మి కి కూడా యు ట్యూబ్ ఛానెల్ ఉండగా.. మిగిలిన మహిళలకు సైతం యు ట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయట. మరి ఇందులో వారికి ఏమి సమస్య ఉందొ తెలియదు, కానీ దాడి చేసి కొట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news