రామాయణ్ మూవీకి రణ్ బీర్, సాయిపల్లవి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

-

బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారి దర్శకత్వం వహిస్తున్న ‘రామాయణ్’ సినిమా నుంచి తరచూ ఓ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. ఎన్ని వార్తలొచ్చినా ఇప్పటికీ మేకర్స్ మాత్రం ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరికొన్ని విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో సన్నివేశాల కోసం రూ.11 కోట్ల ఖర్చుతో అయోధ్య సెట్ కూడా ఏర్పాటు చేశారని అంటున్నారు. ఇందులో ఆయా పాత్రల్లో నటించనున్న రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ రెమ్యూనరేషన్పై కూడా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

ఈ సినిమా కోసం స్టార్ హీరో రణ్బీర్ ఏకంగా రూ.250 కోట్లు తీసుకుంటున్నాడని టాక్. ఆ మొత్తాన్ని పలు ఇన్స్స్టాల్మెంట్స్ ఒక్కో ఇన్స్స్టాల్మెంట్లో రూ.75కోట్ల చొప్పున తీసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. మరోవైపు సాయి పల్లవి ఏకంగా రూ. 18-20కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాలో మరో కీలక పాత్ర పోషించనున్న కన్నడ స్టార్ యశ్ రూ.150 కోట్ల మేర అందుకోనున్నారని బీ టౌన్లో టాక్ వినిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news