‘బేబీ’ మూవీ చూసి రష్మిక ఎమోషనల్.. వీడియో వైరల్

-

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బేబీ. యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్​గా ఈ సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చింది. విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘బేబీ’ని సాయిరాజేశ్‌ తెరకెక్కించాడు. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ అందుకుంది.

అయితే ఈ సినిమా ప్రీమియర్​ను గురువారం రాత్రి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌లో ప్రసారం చేశారు. ఈ ప్రీమియర్​కు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ ప్రీమియర్‌లో విజయ్‌ దేవరకొండ, రాఖీ ఖన్నా, మారుతితోపాటు పలువురు పాల్గొని సందడి చేశారు. మరోవైపు పాన్ ఇండియా హీరోయిన్​ రష్మిక మందన్న బేబీ సినిమా చూసి ఎమోషనల్ అయింది. సినిమా పూర్తయ్యాక థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన ఆమె.. కాస్త ఎమోషనల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news