మ‌రోసారి ఎమోష‌న‌ల్ అయిన రేణూ దేశాయ్‌.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

-

రేణూదేశాయ్ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి నిత్యం మీడియాతో పంచుకుంటూనే ఉంటారు. తాను జీవితంలో ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌ల గురించి స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చెబ‌తూ.. మోష‌న‌ల్ అవుతూ ఉంటారు. ఇక ఈమె తెలుగులో చేసిన సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పెళ్లి, విడాకుల త‌ర్వాత ఒంట‌రిగానే ఉంటోంది.

అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి త‌న అభిప్రాయాలు పంచుకుంటూ.. బాధ ప‌డుతుంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మ‌రోసారి ఆమె ఎమోష‌న‌ల్ అయింది. అయితే ఈసారి ప‌వ‌న్ గురించి కాదండోయ్‌. ఆమె చిన్న‌త‌నంలో జ‌రిగిన విష‌యం గురించి

జీతెలుగులో వ‌స్తున్న డ్రామా జూనియ‌ర్స్ లో రేణూదేశాయ్ జ‌డ్జిగా చేస్తోంది. ఇక రీసెంట్‌గా ఇందులో జ‌రిగిన ఓ ప్రోగ్రామ్ ను ఉద్దేశించి ఆమె స్పందించారు. త‌న కంటే ముందు ఓ అక్క పుట్టింద‌ని, అయితే తాను పుట్టిన‌ప్పుడు మ‌ళ్లీ ఆడ‌పిల్లే పుట్టింద‌ని త‌న నాన్న బాధ ప‌డ్డాడ‌ని చెప్పింది. త‌న ముఖం కూడా చూడ‌లేద‌ని ఆవేద‌న చెందింది. దీంతో అక్క‌డున్న వారంతా సైలెంట్ అయ్యారు. త‌న కూతురు త‌న‌ను ఓదార్చే ప్ర‌య‌త్నం చేసింది. ఇక ఈ ప్రోగ్రామ్ రేపు ప్ర‌సారం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news