సుశాంత్‌ మరణం తర్వాత నా లైఫ్ మారిపోయింది: రియా చక్రవర్తి

-

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి రియా చక్రవర్తే కారణమని పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ హీరో మరణం విషయంలో రియా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే అధికారులు లోతుగా దర్యాప్తు చేసినా సుశాంత్ డెత్ మిస్టరీని ఛేదించలేకపోతున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన రియా.. సుశాంత్ మరణం.. ఆ తర్వాత మారిపోయిన తన జీవితం గురించి మాట్లాడింది.

సుశాంత్ మరణం తర్వాత తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని రియా చెప్పుకొచ్చింది. మనుషులం కాబట్టి మన లైఫ్​లో ఎంత ట్రాజెడీ జరిగినా ముందుకు సాగక తప్పదు అని రియా పేర్కొంది. తన జీవితంలై ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయానని.. ఆ విషాదం నుంచి తేరుకోవడానికి తనకు చాలా సమయం పట్టిందని చెప్పింది. మీడియాలో వచ్చిన కథనాల వల్ల తాను చాలా నష్టపోయానని.. కనీసం ఏడవడానికి కూడా తనకు సమయం ఇవ్వలేదని రియా చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version