రాజ‌కీయ నాయ‌కుల‌పై ఆర్పీ ప‌ట్నాయ‌క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కార‌ణం అదేనా!

-

క‌రోనా కోర‌లు చాస్తున్న టైమ్ లో మ‌న నాయ‌కులు, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల డాక్ట‌ర్లు అవ‌లంబిస్తున్న తీరు నిజంగా ప్ర‌తి ఒక్క‌రికీ అస‌హ‌నం తెప్పించేదే. ఇక ఇదే విష‌యంపై ఆర్పీ ప‌ట్నాయ‌క్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు ఓ వీడియో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో వైర‌ల్ గా మారింది.

చాలామంది బెడ్ దొర‌క్క‌పోవ‌డంతో ఆస్ప‌త్రి సిబ్బందిపై దాడి చేస్తున్నార‌ని ఇది మంచిది కాద‌న్నారు. అలాగే కొవిడ్ తో చ‌నిపోయే వారికంటే.. ఆక్సిజ‌న్ లేక చ‌నిపోయే వారే ఎక్కువ‌య్యార‌ని ఆర్పీ ఆవేద‌న చెందారు. కొవిడ్ రోగుల‌కు చికిత్స చేస్తున్న సిబ్బందిపై దాడి చేయ‌డం దారుణ‌మ‌న్నారు.

ఇక క‌రోనా లెక్క‌ల‌న్నీ త‌ప్ప‌ని, మ‌ర‌ణాల‌ను దాస్తున్నారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. శ్మ‌శానాల్లో ప‌రిస్థితులు చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పారు. ఇలాంటి టైమ్ మ‌న నాయ‌కుల‌కు మాత్రం ఎల‌క్ష‌న్సే ముఖ్యం అని, ఇలాంటి దౌర్భాగ్య‌పు రాజ‌కీయ నాయ‌కులు ఉన్నారంటూ ఆగ్ర‌హం తెలిపారు. ఎన్నిక‌ల ముందు పెట్టిన శ్ర‌ద్ధ ఇప్పుడెందుకు పెట్ట‌ట్లేద‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టికైనా ప్ర‌జ‌ల‌ను కాపాడండి అంటూ ఆవేద‌న చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news