ఇన్ని ఫ్లాపులొచ్చినా తేజూకి తిరుగులేదు..!

-

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నాడు. తిక్క సినిమా నుండి తేజ్ ఐలవ్యూ వరకు సాయి ధరం తేజ్ వరుసగా ఆరు సినిమాలు అతన్ని కెరియర్ లో వెనక్కి నెట్టేశాయి. ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేస్తున్నాడు సాయి ధరం తేజ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తేజూ సరసన నివేదా పేతురాజ్, కళ్యాణి ప్రియదర్శిని నటిస్తున్నారు.

ఏప్రిల్ 12 రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాను దిల్ రాజు 15 కోట్లకు కొనేశాడు. దిల్ రాజు కొన్నాడంటే సినిమాలో మ్యాటర్ ఉన్నట్టే లెక్క. ఇక ఓవర్సీస్ మిగతా ఏరియాలు కలిసి మొత్తం 18 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట సాయి ధరం తేజ్ చిత్రలహరి. వరుస ఫ్లాపులు వచ్చినా సరే మెగా మేనళ్లుడు సినిమా మంచి బిజినెస్ చేసింది. మరి ఈ సినిమాతో అయినా తేజూ హిట్ కొడతాడో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version