విక్రమ్ మూవీ సీక్వెల్ లో హీరోయిన్ గా సాయి పల్లవి..!

-

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో 2019లో వచ్చిన కార్తీ సినిమా ఖైదీ సీక్వెల్ గా వచ్చిన సినిమానే విక్రమ్. ఇందులో కమలహాసన్ హీరోగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు తమిళనాడులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా విక్రమ్ రికార్డు సాధించింది. ఈ సినిమాలో ఊహించని విధంగా విజయ్ సేతుపతి , కమలహాసన్, సూర్య తదితర స్టార్ హీరోలు నటించడం గమనార్హం. మరొక విషయం ఏమిటంటే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. రజినీకాంత్ పై ప్రేమతో ఈ సినిమా కోసం ఒక రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా నటించారు.

ఈ సినిమా సీక్వెల్ వస్తుందని ముందుగానే హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈసారి హీరోని మారుస్తూ #దళపతి 67 అనే వర్కింగ్ టైటిల్ తో విజయ్ దళపతి తో ఈ సినిమా సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు లోకేష్ కనగరాజు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైందంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు బాగా వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం విజయ దళపతి వారిసు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను తెలుగు, తమిళ్లో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ దళపతి లోకేష్ కనగరాజు దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నారు. అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్లో ఏం జరగబోతుంది అనే విషయాన్ని కూడా లోకేష్ ముందుగానే రివీల్ చేసి అభిమానులలో అంచనాలు పెంచేశారు. మళ్లీ డ్రగ్స్, మాఫియా అంశాల చుట్టూనే తిరిగే ఈ సినిమా లో హీరో విజయ్ ఎల్‌సియులో చేరతారని, చివర్లో కమల్ హాసన్, సూర్య, కార్తీ, విజయ్‌ల మధ్య గొడవ జరుగుతుందని లోకేష్ ధృవీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news