అమర్ నాథ్ యాత్రలో సాయి పల్లవి.. ఫోటోలు వైరల్..!

-

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినా భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో హీరోలతో సమానంగా అభిమానులను సంపాదించుకుంది. ఇక చాలాకాలం గ్యాప్ తీసుకొని ఇటీవలే తన కొత్త సినిమాను ప్రకటించింది. తాజాగా తమిళ హీరో శివ కార్తికేయన్ సరసన SK 21 అనే సినిమాలో నటిస్తున్నట్లు వెల్లడించింది. ఇక ఈ సినిమా షూటింగు కాశ్మీర్లో జరుగుతుండగా అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో సాయి పల్లవి తన కుటుంబంతో కలిసి అమర్నాథ్ యాత్ర చేసింది.

ఈ విషయాలను ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ఆమె తన సోషల్ మీడియా ద్వారా.. “అమర్నాథ్ యాత్రకు వెళ్లాలి అన్నది ఎప్పటినుంచో ఉన్న నా కల.. ఈ యాత్రకు 60 సంవత్సరాలు ఉన్న నా తల్లిదండ్రులను తీసుకెళ్లడం ఎంతో సవాలు అనిపించింది.. నాకు మధ్య యాత్రలో వారు అలసిపోయి.. ఆయాస పడుతూ ఊపిరి తీసుకోవడానికి కష్టం అనిపించి చాతిని పట్టుకోవడం వంటి పరిస్థితులు చూసి స్వామి వారు ఎందుకని ఇంత దూరంలో ఉన్నారు అని ప్రశ్నించాను.. అయితే ఈ ప్రశ్నకు సమాధానం నాకు తిరుగు ప్రయాణంలో లభించింది.

అలసిపోయిన కొంతమంది యాత్రికులు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించి నడుస్తుండగా వాళ్ల బలం మళ్ళీ పుంజుకొని తిరిగి ప్రయాణం మొదలుపెట్టడం అలాగే అక్కడి గ్రామస్తులు, గుర్రాలు ఆ యాత్రికుల కలను నెరవేర్చడానికి చేస్తున్న ప్రయత్నం నా మనసును ఒక్కసారిగా హత్తుకున్నాయి. ఇక ఈ యాత్ర నా సంకల్ప శక్తికి, ధైర్యానికి పరీక్ష పెట్టింది అంటూ సాయి పల్లవి పోస్ట్ చేసింది. మొత్తానికైతే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Sai Pallavi (@saipallavi.senthamarai)

Read more RELATED
Recommended to you

Latest news