Samantha: ‘ఏ మాయ చేసావె’ను గుర్తుచేసుకుంటూ సమంత పోస్ట్‌

-

టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధికి సామ్ చికిత్స కూడా తీసుకుంటోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని ట్రీట్​మెంట్​ కోసం విదేశాలకు వెళ్తోందనే ప్రచారం జరిగింది.

అయితే.. ప్రస్తుతం న్యూయార్క్ లో ఇండియా డే పరేడ్ లో పాల్గొన్న సమంత…’ఏ మాయ చేసావే’ మూవీని గుర్తు చేసుకుంటూ ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. ‘నా తొలి చిత్రం షూటింగ్ ఇక్కడే జరిగింది. అప్పుడు కెరీర్ ఎలా ఉంటుందో తెలియక భయపడిన చిన్న పిల్లను నేను. గొప్ప కలలతో ధైర్యంగా ముందడుగు వేశా. 14 ఏళ్ల తర్వాత ఇండిపెండెన్స్ డే పరేడ్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది’ అని రాసుకోచ్చారు. ఈ మూవీలో నాగచైతన్య, సమంత నటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news