సినీ లవర్స్​కు గుడ్​న్యూస్.. ‘త్రీ ఇడియట్స్​’ సీక్వెల్​కు మేకర్స్ ప్లాన్

-

2009లో విడుదలై అన్నివర్గాల ప్రేక్షకులను అలరించడమే కాదు.. కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా త్రీ ఇడియట్స్. రాజ్‌ కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్, శర్మన్‌ జోషి, మాధవన్‌ నటించిన ఈ సినిమా అంటే నచ్చని వారుండరు. ఈ మూవీ ఇప్పటికే ఇతర భాషల్లోనూ రీమేక్ అయి.. అంతే ఆదరణ పొందింది. అయితే తాజాగా ఈ సినిమా సీక్వెల్​పై నటుడు శర్మన్ జోషి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ‘త్రీ ఇడియట్స్‌’ సినిమాలో రాజు పాత్రతో అలరించిన శర్మన్‌ జోషి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

‘‘త్రీ ఇడియట్స్‌ సినిమాకు సీక్వెల్ ఉంటుంది. సీక్వెల్ తెరకెక్కితే అది కచ్చితంగా ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటుంది. రాజ్‌కుమార్‌ హిరాణీ కూడా దీనిపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా సీక్వెల్‌ కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. వాళ్లను నిరాశపరచడం ఆయనకు ఇష్టంలేదు. దీనికి సంబంధించిన కొన్ని ఆలోచనలను ఆయన నాతో పంచుకున్నారు. దీని సీక్వెల్‌ కచ్చితంగా ప్రేక్షకులకు రెట్టింపు ఉత్సాహాన్నిస్తుంది’’ అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news