సింగీతం శ్రీనివాస రావు బాలకృష్ణ ల ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 ..!

-

ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 106 చేస్తున్నారు. ఈ సినిమాతో ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ కంప్లీట్ చెసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమాని త్వరలో మళ్ళి మొదలు పెట్టబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి గత కొన్ని రోజులుగా “మోనార్క్” అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ టైటిల్ ని జూన్ 10 న బాలకృష్ణ బర్త్ డే సందర్భాంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తుంది.

 

అంతేకాదు ఈ సినిమాలో బాలయ్య సరసన నటించే ఇద్దరు హీరోయిన్స్ ని అదే రోజు ప్రకటించనున్నారని తాజా సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తాడని అంటున్నారు. లాక్ డౌన్ లో పూరి బాలయ్య కోసం కథ రాసినట్టు వార్తలు వచ్చాయి. ఆ కథ బాలయ్య కి కూడా నచ్చిందని సమాచారం.

ఇదిలా ఉండగానే మరో తాజా వార్త బయటకి వచ్చింది. గతంలో ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు బాలకృష్ణ ల ఆదిత్య 369 వచ్చి సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ సినిమాకి సీక్వెల్ నిర్మించాలని అటు దర్శకులు ఇటు బాలయ్య అనుకున్నారు. కాని కుదరలేదు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ సినిమాకి సీక్వెల్ గా ఆదిత్య 999 రూపొందనుందని తాజా సమాచారం. సైన్స్ ఫిక్షన్ కావడంతో ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారని త్వరలో ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన వెలువడనుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version