ఎన్టీఆర్ కాదు పొడిపించుకోవడానికి.. అక్కడున్నది జగన్!

-

జగన్ ను పొగడాలన్నా, అభినందించాలన్నా… చంద్రబాబు & కోలను విమర్శించాలన్నా… పోసాని తర్వాతే ఎవరైనా అన్నాకూడా అతిశయోక్తి కాదేమో. తాను చెప్పాలనుకున్న విషయం వీలైనంత వరకూ సూటిగా, సుత్తిలేకుండా చెప్పేప్రయత్నం చేస్తుంటారు పోసాని. ఇందులో భాగంగా… తాజాగా ఏపీ సర్కార్ పై బాలయ్య చేసిన వ్యాఖ్యలపై పోసాని తనదైన శైలిలో స్పందించారు.

ఇటీవలి జరిగిన ఆన్ లైన్ మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ… ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేయగా.. బాలకృష్ణ అయితే ఏకంగా వైకాపా ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండదని.. రాబోయే నాలుగేళ్లలోనే ఏదో ఒకసమయంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేస్తుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈస్థాయిలో పగటి కలలు కంటున్న బాలయ్య మానసిక పరిస్థితి బాగాలేదని వైకాపా నాయకులు కామెంట్లు చేశారనుకోండి… కానీ ప్రస్తుతానికి అది అప్రస్తుతం. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై పోసాని తనమార్కు సెటైర్స్ వేశారు.

ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మొదలుపెట్టిన పోసాని… ఈనాలుగేళ్లలోనే ఏపీలో వైకాపా ప్రభుత్వం కూలిపోయి.. పార్టీ పతనమైపోయి.. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడానికి అక్కడున్నది ఎన్టీఆర్ కాదని.. జగన్ అని పోసాని అన్నారు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారు, ఆయన పొడిపించుకున్నారు. కానీ… ఇక్కడున్న జగన్ – ఆయన పొడవడు, పొడిపించుకోడు అని పోసాని తనదైన శైలిలో “ఎన్టీఆర్ వెన్నుపోటు” అంశాన్ని ప్రస్థావిస్తూ.. బాలయ్య వ్యాఖ్యలపై స్పందించారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version