ఓటీటీలోకి కీర్తి సురేశ్‌ ఎమోషనల్‌ డ్రామా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

మహానటి ఫేం కీర్తి సురేశ్, జయం రవి కీలక పాత్రల్లో నటించిన యాక్షన్‌ ప్యాక్డ్‌ ఎమోషనల్‌ డ్రామా ‘సైరెన్‌’ .. 108.. అనేది ఉపశీర్షిక. ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను తొలుత తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లో విడుదల చేయాలని భావించారు. కానీ, ఫిబ్రవరి 19న తమిళంలో మాత్రమే థియేటర్‌లో రిలీజ్‌ చేశారు. ఇప్పుడు తెలుగులో డైరెక్ట్‌గా ఓటీటీలో రానుంది. ఏప్రిల్‌ 19వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ప్రసారం కానుంది. ఐదు భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

ఇది స్టోరీ.. తన భార్య జెన్నీఫర్‌ (అనుపమపరమేశ్వరన్‌)ను మర్డర్‌ చేసిన కేసులో తిలగన్‌(జయం రవి)కు శిక్ష పడుతుంది. అప్పటికే వారికి ఓ కూతురు ఉంటుంది. ఖైదీ కూతురు అంటూ బాల్యంలో అందరూ ఆమెను హేళన చేయడంతో ఆమె తండ్రిని ద్వేషించడం మొదలుపెడుతుంది. జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన ఇద్దరు పొలిటికల్‌ లీడర్స్‌తో పాటు పోలీస్‌ ఆఫీసర్‌ను చంపేస్తాడు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతను నందిని (కీర్తి సురేష్‌) తీసుకుంటుంది. అసలు తిలగన్ నిజంగానే తన భార్యను హత్య చేశాడా? నందిని దర్యాప్తులో ఏం తేలింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news