రామానాయుడు బయోపిక్ తియకపోవడానికి కారణం అదే అంటున్న కుమారులు..!!

-

తెలుగు చిత్ర పరిశ్రమలో దిగ్గజ నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. అలనాటి దిగ్గజ నిర్మాత డి రామానాయుడు వారసుడిగా ఆయన కుటుంబం నుంచి వెంకటేష్, సురేష్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే హీరోగా సురేష్ బాబు నటించకపోవడనికీ ఇంట్రెస్ట్ లేకపోవడంతో ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతున్నారు. కానీ వెంకటేష్ మాత్రం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సురేష్ బాబు కూడా నిర్మాతగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తను ఏ రోజు కూడా నష్టపోలేదని తెలియజేశారు.

అందుకు కారణం తను ఎంచుకొనే కథలలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారని ఒకానొక సందర్భంలో తెలియజేశారు. ముఖ్యంగా తన సోదరుడైన వెంకటేష్ నటించిన ఎన్నో చిత్రాలకు సురేష్ బాబు నిర్మాతగా ఉండడం గమనార్హం. అయితే ఇప్పుడు ఎక్కడ చూసిన బయోపిక్ హవానే ఎక్కువగా కొనసాగుతూ ఉన్నది. ఇలాంటి సమయంలోనే ప్రముఖ నిర్మాత అయిన రామానాయుడు బయోపిక్ తీయడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తన తండ్రి బయోపిక్ తీయడానికి మాత్రం సురేష్ బాబు ఆసక్తి చూపించడం లేదు. ఇక తన తండ్రి బయోపిక్ తీయకపోవడానికి గల కారణాలను కూడా వెల్లడించారు సురేష్ బాబు. వాటి గురించి చూద్దాం.

సురేష్ బాబు మాట్లాడుతూ తన తండ్రి బయోపిక్ తీయాలని ఆలోచన ఇంకా రాలేదని.. ఇప్పటివరకు నా కుటుంబం వ్యక్తిగత జీవితాన్ని సినిమా ప్రపంచానికి చాలా దూరంగానే ఉంచాము.. ఇక ఏ రోజు కూడా మా కుటుంబ వ్యక్తిగత విషయాలను ఎవరికి తెలియజేయలేదు. కానీ బయోపిక్ తిస్తే మాత్రం ఇవన్నీ చెప్పాల్సి ఉంటుంది అలా కాకుండా.. ఆయన కెరియర్ గురించి సినిమాల గురించి చెబితే చూసేవాళ్ళు చాలా బోర్ గా ఫీల్ అవుతారని అందుచేతనే వారిని ఇబ్బంది పెట్టకూడదు కాబట్టే తన తండ్రి బయోపిక్ తేరకెక్కించడానికి మాకు ఆసక్తి లేదు.. అంటు సురేష్ బాబు తెలిపారు. ఇక అంతే కాకుండా ఇప్పటివరకు వచ్చిన మిగతా వ్యక్తుల పైన బయోపిక్ నిజం కాదని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news