అది ఆశీర్వాదం, ఇది కర్మ.. శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

-

కరోనాకు ప్రపంచమంతా వణికిపోతూ ఉంటే.. శ్రీ రెడ్డి మాత్రం అందులోనూ ఓ కౌంటర్, సెటైర్ వేసింది. చైనాలో పుట్టిన కరోనా.. మానవాళిని గడగడలాడిస్తోంది. మన దేశంలోనూ శరవేగంగా దూసుకుపోతోన్న ఈ వైరస్‌కు అడ్డుకట్ట వేయలేకపోతోన్నారు. ఇప్పటికే దాాదాపు 137మందికి కరోనా సోకినట్టు నిర్దారించారు. అందులో విదేశీయులు 17 ఉన్నట్లు తెలుస్తోంది.

ఇలా కరోనా ఇంతలా తన ప్రభావాన్ని చూపుతుంటే.. దానిపైనే కొంతమంది మీమ్స్, ట్రోల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక శ్రీ రెడ్డి సైతం కరోనా బారిన పడేవారికి ఓ కౌంటర్ వేసింది. నిత్యం ఏదో ఒక వివాదంపై స్పందించడం, వార్తల్లో నిలవడం శ్రీ రెడ్డికి అలవాటే. హాట్ హాట్ ఫోజులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. పద్దతిగా చీర కట్టుకుని గుడికి వెళ్లిన శ్రీ రెడ్డి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది.

గుడికి వెళ్లిన శ్రీ రెడ్డి.. ‘దేవాలయంలో పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం ఆశీర్వాదం.. కరోనా పాజిటివ్ అని తేలడం కర్మ.. జాగ్రత్త’ అంటూ పోస్ట్ చేసింది. అంతకుమందు విశాల్-డైరెక్టర్ మిస్కిన్ వ్యవహారంలో తలదూర్చింది. తన మద్దతు ఎల్లప్పుడూ దర్శకులకే ఉంటుందని చెబుతూ విశాల్‌ను టార్గెట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news