మెగా ఫోన్ పడుతున్న మరో హీరో

-

హీరోలుగా ప్రేక్షకుల మనసులు గెలవడమే కాదు కొంతమంది ఇంకా తమలోని వెరైటీ టాలెంట్ తో ప్రేక్షకులను మెప్పించాలని చూస్తారు. అందులో భాగంగానే హీరోలు మెగా ఫోన్ పట్టిన సందర్భాలు ఉన్నాయి. వారికి ఉదహరణగా చాలా మంది ఉన్నారు. లేటెస్ట్ గా వారిలో కలిసేందుకు సిద్ధమయ్యాడు తమిళ హీరో అండ్ విలన్ అరవింద స్వామి. 90వ దశకంలో అమ్మాయిల కలల రాకుమారుడు అయిన అరవింద స్వామి కడలితో రీ ఎంట్రీ ఇచ్చాడు.

తమిళంలో వచ్చిన తని ఒరువన్ సినిమాలో విలన్ గా నటించి హిట్ కొట్టిన అరవింద స్వామి విన గా ప్రస్తుతం కెరియర్ పీక్స్ లో ఉన్నాడు. తెలుగులో కూడా ధ్రువ తర్వాత క్రేజీ ఆఫర్స్ వచ్చాయట కాని ఆయనే వద్దన్నాడని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా అరవింద స్వామి తాను త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నానని స్వయంగా వెళ్లడించారు.

ప్రస్తుతం తన దగ్గర మూడు కథలు ఉన్నాయని.. వాటిలో ఒకటి త్వరలో సినిమాగా ఎనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చారు అరవింద స్వామి. రీసెంట్ గా మణిరత్నం డైరక్షన్ లో వచ్చిన నవాబ్ సినిమాలో వరద పాత్రలో మరోసారి తన సత్తా చాటాడు అరవింద స్వామి. మరి హీరో, విలన్ గా మెప్పిస్తున్న ఈయన దర్శకుడిగా ఎలాంటి సినిమాలు చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version