తప్పు చేస్తే తప్పించుకోలేరు…జగదీశ్ రెడ్డి

-

 

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ సోదాలు జరుపుతుంటే కాంగ్రెస్ నేతలు అతిగా స్పందించారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేంద్ర సంస్థలు వచ్చి సోదాలు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. వ్యాపారులు, రాజకీయ నాయకులపై  ఐటీ సోదాలు జరగడం కామన్. ఆఫిడవిట్ లో తేడా ఉందని ఎవరో ఫిర్యాదు చేస్తే తెరాసకు, సీఎంకి ఏం సంబంధం? ప్రతీ విషయాన్ని సీఎం కి ఆపాదించి మాట్లాడటం తగదన్నారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్నారు. రేవంత్ రెడ్డి కంటే ముందు తెరాస ఎంపీపై కూడా ఐటీ సోదాలు చేసిందనే విషయాన్ని మరవొద్దన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version