“సర్కారు వారి పాట” నుంచి బిగ్ అప్డేట్… ఈనెల 20 న సెకండ్ సింగిల్

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరో, ప్రిన్స్‌ మహేష్‌ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమా “సర్కారు వారి పాట”. ఈ సినిమాకు టాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ పరుశురాం దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ అండ్ మాస్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు… మహానటి కీర్తిసురేష్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా కు నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ మరియు గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.ఇది ఇలా ఉండగా సర్కారు వారి పాట సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ ను ఈ నెల 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. “పెన్ని” అంటూ సాగే.. ఈ పాటను 20వ తేదీ ఉదయం విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ విడుదల చేసింది. ఈ పోస్టర్‌ లో మహేష్‌ బాబు.. చాలా క్యూట్‌ గా ఉన్నాడు. కళ్లజోడు పెట్టుకుని మెరిసిపోతున్నాడు. ఇక ఈ అప్టేట్‌ తో మహేష్‌ ఫ్యాన్స్‌ పండగ చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news