టీజర్ టాక్: పిట్టకథలుగా తెలుగు లస్ట్ స్టోరీస్..

-

హిందీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ ని పిట్ట కథలు పేరుతో తెలుగులో రీమేక్ చేసారు. మొత్తం నాలుగు కథల్ని నలుగురు దర్శకులు డైరెక్ట్ చేసారు. తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్ కలిసి దర్శకత్వం వహించిన ఈ పిట్ట కథలు సిరీస్ టీజర్ రిలీజైంది. మంచు లక్ష్మి, ఈషారెబ్బా, శృతిహాసన్, అమలా పాల్ నటించిన ఈ సిరీస్ లో బోల్డ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. సిరీస్ కథాంశమే బోల్డ్ కాబట్టి, టీజర్ లో అది ఏ లెవెల్లో ఉంటుందో చూపించారు.

జగపతిబాబు, సత్యదేవ్, మేఘన, సంజిత్ హెగ్డే ఇతర నటీనటులుగా నటించిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్స్ లో భాగంగా రూపొందింది. రోనీ స్క్రూవాలా ఆషి దువా సంయుక్తంగ నిర్మిస్తున్న ఈ సిరీస్ ఫ్లైయింగ్ యూనికార్న్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రూపొందింది. ఫిబ్రవరి 19వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవనుందని ప్రకటించారు. మరి హిందీలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ తెలుగులో ఎలా అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news