ఘనంగా వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్..!

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల త్వరలోనే పెళ్లి పీటలెక్కపోతున్న విషయం తెలిసిందే.కొన్ని సంవత్సరాలుగా తాను ప్రేమిస్తున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ఆయన పెద్దల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నారు. అందులో భాగంగానే నిన్న రాత్రి వరుణ్ తేజ్, లావణ్య ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది పెద్దలు హాజరయ్యారు అని చెప్పాలి. ఇకపోతే నాగబాబు తనయుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంత కాలంగా లవ్ ట్రాక్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఇప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

నిన్న రాత్రి 8 గంటలకు వీరిద్దరికీ అత్యంత సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ పెద్దలు నిర్వహించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. గ్రీన్ కలర్ సారీ లో దేవకన్యలా లావణ్య త్రిపాఠి అనిపించగా.. వైట్ కలర్ డ్రెస్ లో వరుణ్ తేజ్ కూడా చాలా అందంగా మెరిసిపోయారు. ఈ జంట చాలా చాలా చక్కగా అతిధులను ఆకర్షించింది. ఇకపోతే ఈ నిశ్చితార్థ వేడుకకు మెగా , అల్లు, లావణ్య కుటుంబాలు మాత్రమే హాజరయ్యాయి. ఇకపోతే ఈవెంట్ కి స్టైలిష్ గా వ్యవహరిస్తున్న అశ్విన్మౌళి, వనిత డోంగ్రేలు కాస్టింగ్ డిజైనర్లుగా వ్యవహరించారు. అలాగే వరుణ్ తేజ్ కు తరుణ్ తహిలియా డిజైనర్ గా వ్యవహరించారు.

ఇక వరుణ్ తేజ్ సినిమాల విషయానికొస్తే.. వరుణ్ తేజ్ ప్రస్తూరం గాండీవధారి అర్జున అనే ఒక సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది.. శక్తి ప్రతాప్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు పలాస ఫేం కరుణ కుమార్ తో కూడా వరుణ్ తేజ్ మరో సినిమా చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Lavanya tripathi (@itsmelavanya)

Read more RELATED
Recommended to you

Latest news